డా. పూనమ్ టాండన్
ఛీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్
ఇండియాఫస్ట్ లైఫ్ యందు చీఫ్ ఇన్వెస్ట్మెంట్ అధికారిగా, డాక్టర్ పూనమ్ టాండన్ గారు కంపెనీ కొరకు పెట్టుబడి నిర్వహణ విభాగానికి నాయకత్వం వహిస్తున్నారు. పూనమ్ గారు బి.ఎఫ్.ఎస్.ఐ రంగములో ఆర్థికపరమైన విపణులు మరియు పెట్టుబడి యాజమాన్యములో విశేష గ్రాహ్యత కలిగియున్న ప్రముఖ సాధకులుగా ఉన్నారు.
ఇండియాఫస్ట్ లైఫ్ తో 13-సంవత్సరాల తన సుదీర్ఘ సాహచర్యంలో, పూనమ్ గారు కార్పొరేట్ గ్రూప్ బిజినెస్, యులిప్ మరియు సాంప్రదాయక నిధిలో ఋణ విభాగము, లిక్విడిటీ యాజమాన్యము, సాంప్రదాయక పోర్ట్ఫోలియో లోని ఈక్విటీలో పెట్టుబడి కొరకు ఆస్తుల కేటాయింపు మరియు అసెట్ లయబిలిటీ కమిటీ (ALCO) కి దోహదపడటంతో పాటుగా అనేక విభాగాల వ్యాప్తంగా పలు హోదాల విధులను నిర్వర్తించారు.
ఆర్థిక సేవల రంగములో ~30 సంవత్సరాల పాటు ప్రదర్శనాత్మక కెరీర్ యందు, పూనమ్ గారు మెట్లైఫ్ ఇండియా ఇన్సూరెన్స్, పటర్నోస్టర్ ఎల్ఎల్సి, సెక్యూరిటీస్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టిసిఐ) మరియు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా అనేక అగ్రగామి బీమా ప్రతిపత్తి సంస్థలతో కలిసి పనిచేశారు. 2001 లో కార్పొరేట్ బాండ్స్ డెస్క్ని వ్యవస్థాపించిన బృందంలో భాగం కావడం మరియు 2004లో ఎస్టిసిఐ లో స్వాప్స్ డెస్క్ని స్థాపించడం పూనమ్ గారి చెప్పుకోదగ్గ విజయాలుగా ఉన్నాయి. ఈ డెస్క్ లు, కంపెనీ యొక్క అట్టడుగు రేఖకు గణనీయంగా జోడింపును ఇవ్వడంతో పాటుగా కార్పొరేట్ బాండ్లలో అత్యంత క్రియాశీలకంగా తయారయ్యాయి.
పూనమ్ గారు 2010 నుండి 2012 వరకూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్ (ఎన్.ఎస్.ఐ.ఎం) లో రెగ్యులర్ విజిటింగ్ ఫేకల్టీగా ఉంటున్నారు. ఆమె ఇతర సంస్థలతో పాటుగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ బ్యాంకర్స్ శిక్షణ కళాశాల, ఎన్.ఎం.ఐ.ఎం.ఎస్ (ముంబై), మరియు యుటిఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కేపిటల్ మార్కెట్స్ లలో అతిథి ఉపన్యాసాలు ఇచ్చారు. పూనమ్ గారు రెండు పత్రాలను రచించారు, అవి స్థిర ఆదాయ విభాగముపై దృష్టి సారించే ఇంటర్నేషనల్ జంట-సమీక్షిత పత్రికలలో ప్రచురించబడ్డాయి.
న్యూఢిల్లీ లోని జీసస్ అండ్ మేరీ కాలేజ్ యందు బి.కాం (హానర్స్) పట్టా పుచ్చుకున్న పట్టభద్రురాలు అయిన పూనమ్ గారు, బిజినెస్ మేనేజ్మెంట్ లో ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాతో జంషెడ్పూర్ ఎక్స్.ఎల్.ఆర్.ఐ యొక్క పూర్వ విద్యార్థిని. ఆమె ఎన్.ఎం.ఐ.ఎం.ఎస్-ముంబై నుండి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో తన పి.హెచ్.డి పట్టా అందుకున్నారు.